దేశాభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

by Disha Web Desk 1 |
దేశాభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ తోనే దేశాభివృద్ధి సాధ్యమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన వందలాది మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తామంతా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ప్రధానంగా సీఎం కేసీఆర్ సమర్థవంత పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వానికి వారు మద్దతు పలికారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని, రెట్టింపు గౌరవం ఉంటుందని ఆయన భరోనిచ్చారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేద ప్రజల పెన్నిథిగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 450 సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న సీఎం కేసీఆర్ దేవుడు అని అన్నారు. తెలంగాణ సమాజమంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను మూడోసారి గెలిపిస్తాయన్న ధీమాను వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ పై ఉన్న అచంచల విశ్వాసంతోనే అన్ని వర్గాల వారు బీఆర్ఎస్ లో చేరుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. సబ్బండవర్గాల అండదండలు గులాబీ జెండకే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పీడించే భూతాలుగా మారాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వమే దేశ ప్రజలకు భరోసా అని జీవన్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పాలన నచ్చడం వల్లే తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా పార్టీలోకి వలసల వరద కొనసాగుతోందని జీవన్ రెడ్డి అన్నారు.

Also Read: తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు : స్పీకర్ పోచారం

ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.. ఆరిజిన్ డెయిరీ సీఈవో సెజల్

Next Story

Most Viewed